అక్రమ అరెస్టులు సమంజసం కాదు

ABN , First Publish Date - 2020-06-05T10:04:20+05:30 IST

సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని ఆ పార్టీ

అక్రమ అరెస్టులు సమంజసం కాదు

చేవెళ్ల: సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. పీసీసీ పిలుపు మేరకు మండలంలోని కాంగ్రెస్‌ నాయకులు మంజీర డ్యాం సందర్శనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎంపీటీసీ సున్నం వసంతం, పీసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, గోనె ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ రమేష్‌గౌడ్‌, శ్రీనివాస్‌, తదితరులను గురువారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-06-05T10:04:20+05:30 IST