టీడీపీకి చేటు చేస్తే ఉపేక్షించం : పల్లె
ABN , First Publish Date - 2022-05-25T06:27:06+05:30 IST
తెలుగుదేశం పార్టీకీ చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించేది లేదని, వారు తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి సూచించారు.
పుట్టపర్తి రూరల్, మే 24 : తెలుగుదేశం పార్టీకీ చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించేది లేదని, వారు తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పెడపల్లి, ఇరగరాజుపల్లిలలో జరుగుతున్న మారెమ్మ, గంగమ్మ జాతరల్లో పాల్గొన్నారు. అనంతరం కప్పలబండ, పెద్దకమ్మవారిపల్లె తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. తాను ఓ పద్ధతి ప్రకారం వెళ్లేవాడనని, దీనిని కొందరు అలుసుగా తీసుకొని చేతగాని వాడిగా భావిస్తే వారి భరతం పడతానని పరోక్షంగా టీడీపీ బహిస్కృత నేతలను హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు. ఆయన వెంట పార్టీ కన్వీనర్ విజయ్కుమార్, మాజీ వైస్ఎంపీపీ బొమ్మయ్య, మురళి, మండల నాయకులు, జిల్లా కార్యవర్గసభ్యులు, పార్టీ అనుబంద సంఘాల సభ్యులు ఉన్నారు.