సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం
ABN , First Publish Date - 2022-05-28T05:05:30+05:30 IST
పా రిశుధ్య కార్మికుల సమస్య లు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అబ్బవరం రామాంజులు ప్ర భుత్వాన్ని హెచ్చరించారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు
రాయచోటిటౌన్, మే27: పా రిశుధ్య కార్మికుల సమస్య లు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అబ్బవరం రామాంజులు ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం పారిశుధ్య కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ రాంబాబుకు వి నతి పత్రం అందజేసిన ఆ యన విలేకర్లతో మాట్లాడుతూ చనిపోయిన, విశ్రాంత కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడంతో మిగిలిన వారిపై పనిభారం పడుతోందన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు, జీఓలు చెబుతున్నా అధికారులు కార్మికుల జీతాల్లో అసమానతలు పెంచిపోషిస్తూ కొందరికి రూ.18 వేలు, మరికొందరికి రూ.15 వేలు ఇస్తుండడం కార్మికుల మధ్య చిచ్చుపెట్టడమేనన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపకపోతే జూన్ 10 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు సిద్దయ్య, వెంకట్రమణ, భూషణ, రామచంద్రయ్యలతో పాటు కార్మికులు పాల్గొన్నారు.