నిప్పు రాజుకుంటే పండగే!

ABN , First Publish Date - 2020-08-20T05:34:33+05:30 IST

అడవి అంటుకుంటే ఎంతో శ్రమించి ఆర్పే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌లోని నారా అనే ప్రాంతంలోని ప్రజలు వాళ్లే కొండపై ఉన్న

నిప్పు రాజుకుంటే పండగే!

అడవి అంటుకుంటే ఎంతో శ్రమించి ఆర్పే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌లోని నారా అనే ప్రాంతంలోని ప్రజలు వాళ్లే కొండపై ఉన్న అడవికి నిప్పు పెట్టి, బాణసంచా కాల్చి పండగ జరుపుకుంటారు. 18 వ శతాబ్దంలో ప్రారంభమెన ఆ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలుసా!


  1. జపాన్‌లో నారా అనే పట్టణం పక్కనే వాకాకుసా అనే చిన్న కొండ ఉంది. ఏటా ఆ కొండపై ఉన్న గడ్డికి నిప్పు పెట్టి పండగ జరుపుకొంటారు. దీన్ని వాకాకుసా బర్నింగ్‌ మాంటేన్‌ ఫెస్టివల్‌ అని పిలుస్తారు.
  2. ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమయిందో ఎవ్వరికీ తెలియదు. కానీ కొన్ని వందల ఏళ్లుగా వస్తోంది. 18వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో ఉన్న రెండు బౌద్ధ ఆలయాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా మొదలైందని కొందరు చెబుతారు. అడవి పందులను తరిమేందుకు నిప్పు పెట్టడం మొదలుపెట్టారని మరికొందరు అంటారు.
  3. ఎలాగైతేనేం ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏప్రిల్‌ నెల ప్రారంభానికి చెర్రీచెట్లు బాగా వికసిస్తాయి. శీతకాలం మొదలుకావడంతో చెర్రీ చెట్లు ఆకులు రాలుస్తాయి. గడ్డి ఎండిపోతుంది. అప్పుడే పండగ ప్రారంభమవుతుంది.

Updated Date - 2020-08-20T05:34:33+05:30 IST