మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం
ABN , First Publish Date - 2020-09-20T08:59:01+05:30 IST
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని మాజీ వైస్ ఎంపీపీ ఆవుల కిష్ట పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల కిష్ట
గార్లదిన్నె, సెప్టెంబరు 19: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని మాజీ వైస్ ఎంపీపీ ఆవుల కిష్ట పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే విషయంపై శనివారం విద్యుత్శాఖ ఏఈ ఆశోక్కుమార్ మర్తాడు గ్రామానికి వెళ్లారు.
దీంతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు వద్దు అంటు గ్రామంలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ ఆవుల కిష్ట మాట్లాడుతూ రైతు ప్రభుత్వమంటు గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు.
పంపుసెంట్లకు మీటర్లు బిగిస్తే రైతులపై భారం పడుతుందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్శాఖ ఏఈ ఆశోక్కుమార్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆవుల కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ సుబ్బయ్య, యుగంధర్రెడ్డి, వెంకటరమణరెడ్డి, ఓబిలేసు, బయన్న, బీరే సుబ్బన్న, తాతిరెడ్డి రైతులు పాల్గొన్నారు.