ఘనంగా నాభిశిల ప్రతిష్ఠాపన వార్షికోత్సవం

ABN , First Publish Date - 2020-02-20T05:40:23+05:30 IST

ఘనంగా నాభిశిల ప్రతిష్ఠాపన వార్షికోత్సవం

ఘనంగా నాభిశిల ప్రతిష్ఠాపన వార్షికోత్సవం

ఇబ్రహీంపట్నం రూరల్‌: మండలంలోని తులేకలాన్‌ గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠాపన మూడో వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు.మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు  చేశారు. హోమం అనంతరం బొడ్రాయికి మహిళలు బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగమణి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ సామ రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బాసాని రాజిరెడ్డి పాల్గొన్నారు.


ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు

యాచారం : యాచారం మండలం బొల్లిగుట్టతండాలో బుధవారం బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గిరిజనులు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బొడ్రాయికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బొడ్రాయి పండగ సందర్భంగా తండాలో సరిపడా నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందారు. తండాలోని బోరు నుంచి సక్రమంగా నీరు రావడం లేదని తెలిపారు. 

Updated Date - 2020-02-20T05:40:23+05:30 IST