ఐఏఎస్ అధికారికి కోవిడ్-19 పాజిటివ్... కొలీగ్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్‌...

ABN , First Publish Date - 2020-04-04T16:04:41+05:30 IST

మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారికి కరోనా వైరస్...

ఐఏఎస్ అధికారికి కోవిడ్-19 పాజిటివ్... కొలీగ్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్‌...

భోపాల్: మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం ఆరోగ్య శాఖకు చెందిన 120 మంది అధికారులు, సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షల కోసం పంపినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. 


కాగా కోవిడ్-19 వ్యాధికి గురైన యువ ఐఏఎస్ అధికారి స్వయంగా డాక్టర్ కావడంతో... కరోనా వైరస్ కట్టడిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించినట్టు చెబుతున్నారు. అత్యంత సమర్థుడైన అధికారిగా గుర్తింపు ఆయన.. హెల్త్ డైరెక్టరేట్‌లోని 126 మందిని ప్రత్యక్షంగా కలిశారని తెలుస్తోంది. ఇటీవల ఆయన అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తొలిసారి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. కాగా మధ్య ప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 106 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-04-04T16:04:41+05:30 IST