మసీదును నేను కూల్చాను

ABN , First Publish Date - 2020-10-01T08:47:04+05:30 IST

బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి...

మసీదును నేను కూల్చాను

బాబ్రీ తీర్పు నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు వైరల్‌


భోపాల్‌, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అడ్వాణీ, జోషీ సహా 32 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. భోపాల్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసిన ప్రజ్ఞాసింగ్‌ 2019, ఏప్రిల్‌ 21న ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేతలో నేను పాల్గొన్నాను. మసీదు గోపురంపైకి ఎక్కి ధ్వంసం చేశాను. దానికి నేను ఏ మాత్రం చింతించడం లేదు. పైగా గర్వపడుతున్నాను’’ అన్నారు. 

Updated Date - 2020-10-01T08:47:04+05:30 IST