ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా!

ABN , First Publish Date - 2021-02-25T05:41:15+05:30 IST

‘అభివృద్ధిలో ముందుందాం.. అ ధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా.. ఇప్పటి వరకు నేను అనుసరించి న పంథా అది.. నా అనుభవం ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు అన్నభావనతోనే అడుగులు వేస్తా’న ని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా!
కొత్తపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బలరాం

ఎమ్మెల్యే కరణం బలరాం


చీరాల, ఫిబ్రవరి 24 : ‘అభివృద్ధిలో ముందుందాం.. అ ధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా.. ఇప్పటి వరకు నేను అనుసరించి న పంథా అది.. నా అనుభవం ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు అన్నభావనతోనే అడుగులు వేస్తా’న ని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. నియోజకవర్గ పరిధిలో బుధవారం వేటపాలెం మండలం కొత్తపేట, చీరాల మండలం గవినివారిపాలెం గ్రామాలలో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బలరాం ప్రారంభించారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించి కొత్తపేటకు అనుకున్న నిధులకన్నా అదనంగా కేటాయిస్తామన్నారు. ధాన్యం కొనుగో లు కేంద్రాలను సాగుదారులు సద్వినియోగం చేసుకోవాల ని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతు న్న కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన పాలన అందుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రా మారావు, డాక్టర్‌ వరికూటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు,  చుండూరి వాసు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T05:41:15+05:30 IST