పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2021-06-15T05:15:08+05:30 IST

పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలి

పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలి
నర్సరీని పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి

మేడ్చల్‌: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్‌లు పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్‌ మండలం మునిరాబాద్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి నర్సరీ, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు షెడ్డు, రోడ్లును పరిశీలించారు. నీటి ట్యాంకులను నెలకు మూడుసార్లు కడగా లని, తాగునీరు కలుషితం కాకుండా రోజూ బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి సరఫరా చేయాలని ఆదేశించారు. ట్యాంక్‌ శుభ్రం చేసిన తేదీని ట్యాంక్‌ వద్ద రాయాలని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్‌ గణేష్‌, ఎంపీవో వినూత్న, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌, బిల్‌కలెక్టర్‌ విజయ్‌ ఉన్నారు.


  • డీపీవోను కలిసిన మండల సర్పంచ్‌లు


మూడుచింతలపల్లి: నూతన డీపీవో రమణమూర్తిని మండల సర్పంచ్‌లు సంఘం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్‌లు జామ్‌ రవి, ఆంజనేయులు, అనురాధరవీందర్‌రెడ్డి, గోపినాయక్‌, కృ పాకర్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, రామచంద్రయ్య, అలితనర్సింహ ఉన్నారు.

Updated Date - 2021-06-15T05:15:08+05:30 IST