తెలంగాణలో రెండో రోజు నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
ABN , First Publish Date - 2021-07-10T16:08:01+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం వరకు సర్వర్లు పని చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో సాంకేతికపరమైన పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర డేటా సెంటర్లో కొత్త యూపీఎస్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో సోమవారం వరకు రిజిస్ట్రేషన్స్ స్లాట్ బుకింగ్లను అధికారులు నిలిపివేశారు.