శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు విచారణ
ABN , First Publish Date - 2022-03-15T17:39:56+05:30 IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. అటు పీపీకి కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారనేదానిపై లోతైన విచారణ జరిపారు. మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే జితేందర్ రెడ్డి డ్రైవర్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.