హైదరాబాద్: జలమండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-26T21:00:32+05:30 IST
హైదరాబాద్: జలమండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: జలమండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్తో ఖైరతాబాద్ జలమండలి వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కలుషిత నీటిని నివారించాలని నినాదాలు చేస్తూ బీజేపీ శ్రేణులు వాటర్ బోర్డును ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది.