క్రీడాకారిణి శ్రావణి ఇంటి ముందు వీహెచ్ ధర్నా
ABN , First Publish Date - 2022-04-10T18:17:16+05:30 IST
క్రీడాకారిణి శ్రావణి ఇంటి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు.
హైదరాబాద్: సికింద్రాబాద్లోని క్రీడాకారిణి శ్రావణి ఇంటి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రీడాకారిణి శ్రావణికి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రావణికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇతర క్రీడాకారులకు సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్... శ్రావణి ఒక దళిత బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని వి.హనుమంతరావు విమర్శించారు.