నేటి నుంచి హరితహారం ప్రారంభం : మేయర్ విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-06-21T15:39:52+05:30 IST
హరితహారంలో భాగంగా మహానగరంలో కోటిన్నర మొక్కలు నాటబోతున్నామని...నేటి నుంచి హరితహారం ప్రారంభకానున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.
హైదరాబాద్: హరితహారంలో భాగంగా మహానగరంలో కోటిన్నర మొక్కలు నాటబోతున్నామని...నేటి నుంచి హరితహారం ప్రారంభకానున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని లోటస్పాండ్లోని పార్క్లో మేయర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు.