భర్త హైదరాబాద్లో.. భార్య గుంటూరులో మృతి
ABN , First Publish Date - 2020-08-02T13:48:48+05:30 IST
ఆయన ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు. భార్య, భర్త గుంటూరు బ్రాడీపేటలో..
కరోనాతో దిక్కులేని పరిస్థితుల్లో అంత్యక్రియలు
గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఆయన ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు. భార్య, భర్త గుంటూరు బ్రాడీపేటలో నివాసముంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు వివాహమై హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల భర్తకు అనారోగ్యంతో హైదరాబాద్కు వెళ్ళి చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఇక్కడ భార్యకు కరోనా సోకి చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మరణించింది. మొత్తం మూడు రోజుల వ్యవధిలో జరిగిపోయాయి. కరోనా సృష్టించిన కల్లోలంతో జరిగిన ఈ సంఘటనలో భార్యభర్తలిద్దరూ ఒకరికి ఒకరు తెలియకుండానే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.