దిశ కమిటీ సమావేశం...అధికారులపై కిషన్రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2021-11-25T17:52:09+05:30 IST
నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ కమిటీ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.
హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ) కమిటీ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చ జరుగనుంది. కాగా సమావేశానికి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ గైర్హాజరవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, కమిషనర్ లేకుండా సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఆగ్రహంతో జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది.