హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-22T18:04:12+05:30 IST

నగరంలోని బ్యాంకుల్లో కరోనా కలకలం రేపుతోంది. వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు.

హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో కరోనా కలకలం

హైదరాబాద్‌: నగరంలోని బ్యాంకుల్లో కరోనా కలకలం రేపుతోంది. వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఒక్క ఎస్‌బీఐ బ్యాంకులోనే 600 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో బ్యాంకుల సమయాన్ని తగ్గించేలా రాష్ట్ర బ్యాంకర్ల సమితి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు నేటి నుంచి బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. 

Updated Date - 2021-04-22T18:04:12+05:30 IST