HYD: రాజ్భవన్ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు
ABN , First Publish Date - 2021-07-22T18:38:29+05:30 IST
కాంగ్రెస్ నేతల చలో రాజ్భవన్ పిలుపు నేపథ్యంలో రాజ్భవన్ పరిసరరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల చలో రాజ్భవన్ పిలుపు నేపథ్యంలో రాజ్భవన్ పరిసరరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇందిర పార్క్ నుండి రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ఇందిరా పార్క్, రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వర్షంలోను పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.