కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-04T18:32:34+05:30 IST
నగరంలోని దుందిగల్ పరిధి సురారంలో నివసించే కానిస్టేబుల్ రమణ మూర్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: నగరంలోని దుందిగల్ పరిధి సురారంలో నివసించే కానిస్టేబుల్ రమణ మూర్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమణ మూర్తి... గత ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చి గన్ మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత 20 రోజులుగా మద్యానికి బానిసై తమతో ఘర్షణకు దిగే వాడని భార్య పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లడంతో ఈనెల 1న ఇంట్లో ఉరివేసుకుని రమణమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.