ఏపీజే అబ్దుల్ కలాం రాష్ర్టీయ సమ్మాన్ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-09-28T12:14:12+05:30 IST
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను అక్టోబర్ 14న నగరంలో నిర్వహిస్తున్నట్లు శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి జి కృష్ణ తెలిపారు.
కవాడిగూడ, సెప్టెంబర్ 27(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను అక్టోబర్ 14న నగరంలో నిర్వహిస్తున్నట్లు శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి జి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అబ్దుల్ కలాం రాష్ర్టీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 8వ తేదీలోగా తమ దరఖాస్తులను పంపించాలని, పూర్తి వివరాలకు 9494523562, 9390354562 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.