HYD: మిషన్ మిలియన్ ట్రీస్ కార్యక్రమంలో 5 వేల మొక్కలను నాటిన హెచ్డీబీ
ABN , First Publish Date - 2021-11-27T01:31:51+05:30 IST
HYD: మిషన్ మిలియన్ ట్రీస్ కార్యక్రమంలో 5 వేల మొక్కలను నాటిన హెచ్డీబీ
హైదరాబాద్: తమ మిషన్ మిలియన్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ మేడ్చల్ అడవి ప్రాంతంలో 5 వేలకు పైగా మొక్కలను నాటినట్లు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. శాస్త్రీయ పద్ధతిలో మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటుగా దానిని పునరుద్ధరించే ప్రయత్నంలో హెచ్డీబీ మిషన్ మిలియన్ ట్రీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ కార్యక్రమం కింద ఈ కంపెనీ డిసెంబర్ 2019 నాటి నుంచి 150,000 మొక్కలను నాటడంతో పాటుగా వాటి పోషణ కార్యక్రమాలను కూడా చూసింది.
మేడ్చల్లోని బసురగడి గ్రామంలో నాటిన ఈ మొక్కలలో ఔషద మొక్కలతో పాటుగా పండ్ల మొక్కలు సైతం ఉన్నాయి. ఇవి రైతు సమాజానికి సైతం జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచనున్నాయి. నాటిన మొక్కలు కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా పెరుగుతున్న గాలి కాలుష్యం సైతం తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హెచ్డీబీఎఫ్ఎస్ ఉద్యోగులు, అసోసియేట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి సౌత్ హెచ్డీబీఎఫ్ఎస్ రీజనల్ మేనేజర్ వెంకట సతీష్ మాట్లాడుతూ మిషన్ మిలియన్ ట్రీ కార్యక్రమం ద్వారా సమాజానికి మద్దతునందించేలా తమ సీఎస్ఆర్ నిబద్ధతలను కొనసాగించడాన్ని హెచ్డీబీ గర్వంగా భావిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా చేసుకుని ప్రారంభించడంతో పాటుగా వ్యవసాయ సమాజానికి జీవనోపాధినీ అందిస్తుందని అన్నారు.