హుజురాబాద్ తొలిరౌండ్లో BJP ఆధిక్యం
ABN , First Publish Date - 2021-11-02T15:06:55+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్కు 4,444 ఓట్లు, కాంగ్రెస్కు 119 ఓట్లు పోలయ్యాయి.