పెళ్లయిన మొదటి రాత్రే భార్య పొట్టపై ఆపరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించిన భర్త.. ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు తెలిసి..

ABN , First Publish Date - 2022-06-08T22:12:38+05:30 IST

అతను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు.. ఎంతో ఇష్టపడిన భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లాడు..

పెళ్లయిన మొదటి రాత్రే భార్య పొట్టపై ఆపరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించిన భర్త.. ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు తెలిసి..

అతను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు.. ఎంతో ఇష్టపడిన భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లాడు.. మొదటి రాత్రి భార్య  పొట్టపై ఆపరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించాడు.. విషయం ఏంటని అడిగితే ఆమె ఏదేదో చెప్పింది.. అతడు ఆమె గురించి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది.. ఆమె వివాహానికి ముందు వేరే వ్యక్తితో అఫైర్ సాగించి గర్భం దాల్చిందని, ఆ తర్వాత అబార్షన్ చేయించుకుందని తేలింది.. దీంతో అతను తన భార్యను పుట్టింటికి పంపేశాడు.. ఎంతకీ తనను తీసుకెళ్లకపోవడంతో ఆ మహిళ భర్తపై గృహహింస కేసు పెట్టింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన 12 ఏళ్లకు భార్య గర్భవతి.. కడుపులో కవలలు ఉన్నారని తెలిసి మరింత సంతోషం.. కానీ పక్కింటి వాళ్ల నిర్వాకంతో..


మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా అశోక్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి  2019 జూన్‌లో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందే మాటలు కలిపి ఆమెతో ప్రేమలో పడ్డాడు. వివాహం తర్వాత భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లాడు. మొదటి రాత్రి భార్య  పొట్టపై ఆపరేషన్ చేసి కుట్లు వేసిన ఆనవాళ్లను గుర్తించాడు. విషయం ఏంటని అడిగితే ఆమె ఏదేదో చెప్పింది. రెండు మూడు రోజుల తర్వాత భార్య ఎవరితోనో తరచుగా మాట్లాడటం గమనించాడు. దాంతో అతనిలో సందేహాలు మొదలయ్యాయి. ఎంక్వైరీ చేస్తే అతని భార్యకు పెళ్లికి ముందు వేరే వ్యక్తితో అఫైర్ ఉందని తేలింది. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా జరిగినట్టు బయటపడింది. 


దీంతో పెళ్లయిన 10 రోజుల తర్వాత భార్యను అతను పుట్టింటికి పంపేశాడు. మళ్లీ ఆమెను తీసుకెళ్లలేదు. దీంతో ఆ మహిళ తన భర్తపై గృహ హింస కేసు పెట్టింది. అంతేకాదు భారీగా భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా తన బంధువుల ద్వారా భర్తను బెదిరిస్తోంది. దీంతో ఆ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. 


Updated Date - 2022-06-08T22:12:38+05:30 IST