Delhi: భోజనం వడ్డించలేదని దారుణం.. భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే..

ABN , First Publish Date - 2022-06-19T21:59:34+05:30 IST

కేవలం భోజనం వడ్డించలేదనే కారణంతో భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

Delhi: భోజనం వడ్డించలేదని దారుణం.. భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే..

కేవలం భోజనం వడ్డించలేదనే కారణంతో భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఫతేపూరీ బేరీ ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ (47), సోనాలీ (39)కు 2008లో వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు మద్యం సేవిస్తుంటారు. గురువారం రాత్రి కూడా ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత భోజనం వడ్డించమని సోనాలీని వినోద్ అడిగాడు. 


ఇది కూడా చదవండి..

నెల క్రితమే ఈ 22 ఏళ్ల కుర్రాడికి పెళ్లి.. పొద్దున్నే 4 గంటలకు నిద్రలేపిన తండ్రి.. కొద్ది నిమిషాలకే శవంగా.. అసలేం జరిగిందంటే..


మద్యం మత్తులో ఉన్న సోనాలీ భర్తకు భోజనం వడ్డించేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వినోద్ ఓ దిండు తీసి సోనాలీ మొహంపై నొక్కి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అయితే వినోద్ మాత్రం తన భార్య చనిపోయిందనుకోలేదు. రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే పడుక్కున్నాడు. ఉదయం లేచి భార్యను నిద్రలేపేందుకు ప్రయత్నించాడు. 


ఆమె లేవకపోవడంతో అసలు విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-06-19T21:59:34+05:30 IST