చిన్న గొడవ కారణంగా భర్త అనూహ్య నిర్ణయం.. పోలీసులు వచ్చేసరికే ఘోరం జరిగిపోయింది!

ABN , First Publish Date - 2022-06-03T17:54:25+05:30 IST

భార్యభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే కొద్ది సమయానికే గొడవలు సర్దుమనిగి.. ఇద్దరూ హ్యాపీగా కలిసిపోయే ఘటనలు చాలానే చూశాం. కానీ ఓ భర్త మాత్రం చిన్న గొడవ కారణంగా అనూహ్య

చిన్న గొడవ కారణంగా భర్త అనూహ్య నిర్ణయం.. పోలీసులు వచ్చేసరికే ఘోరం జరిగిపోయింది!

ఇంటర్నెట్ డెస్క్: భార్యభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే కొద్ది సమయానికే గొడవలు సర్దుమనిగి.. ఇద్దరూ హ్యాపీగా కలిసిపోయే ఘటనలు చాలానే చూశాం. కానీ ఓ భర్త మాత్రం చిన్న గొడవ కారణంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాగా.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఘటన‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఢిల్లీకి చెందిన సంజయ్(54) అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య రీతూతో కలసి ముండ్కా ప్రాంతంలో నివసిస్తున్న ఆయన.. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడటం అతడికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే జూన్ 2న మద్యం మత్తులోనే ఇంటికి చేరుకున్న ఆయన.. రీతూతో గొడవ పడ్డాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి, గొడవ గురించి చెప్పారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి సంజయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న అధికారులు.. సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-06-03T17:54:25+05:30 IST