భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి బ్లాక్ మెయిల్ చేసిన భర్త.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-04T08:10:13+05:30 IST

భర్త ఇంట్లో లేకపోవడంతో ఆ మహిళ.. తన ఇంటికి సమీపంలో ఉండే మరొక యువకుడికి చేరవైంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టేశారు. వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఈ విషయం తెలిసింది. మొదట ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఆ తర్వాత భార్యను, ఆమె ప్రియుడిని బ్లాక్ మెయిల్ ...

భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి బ్లాక్ మెయిల్ చేసిన భర్త.. చివరకు..

భర్త ఇంట్లో లేకపోవడంతో ఆ మహిళ.. తన ఇంటికి సమీపంలో ఉండే మరొక యువకుడికి చేరవైంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టేశారు. వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఈ విషయం తెలిసింది. మొదట ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఆ తర్వాత భార్యను, ఆమె ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే ఈ అక్రమ సంబంధం విషయాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో పథకం వేసి ఆ ప్రేమికులిద్దరూ.. భర్తను హత్య చేయించారు. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నా సమీపంలో వెలుగు చూసింది. 


వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య శోభ పిల్లల చదువుల కోసం స్వగ్రామంలోనే ఉండిపోయింది. అక్కడే ఆమెకు పొరుగింట్లో ఉండే సంజీవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే ఇంట్లో నివశించడం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన రాజీవ్‌కు ఈ విషయం తెలిసింది. శోభ, సంజీవ్ ఇద్దరినీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో రాజీవ్ అడ్డుతొలగించుకోవాలని అనుకున్న శోభ, సంజీవ్ జంట ఒక కిరాయి గూండాకు రూ.60 వేలు ఇచ్చి రాజీవ్‌ను హత్య చేయించారు. గుర్తుతెలియని మృతదేహం లభించడంతో అది ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నించారు. 


చివరకు అది రాజీవ్‌ది అని గుర్తించి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఈ క్రమంలోనే శోభను విచారణ చేసినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శోభ, సంజీవ్‌తోపాటు వాళ్లకు సహకరించిన మరొక స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Updated Date - 2022-04-04T08:10:13+05:30 IST