రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ.14.30 లక్షలు

ABN , First Publish Date - 2021-01-21T05:09:11+05:30 IST

నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని హుండీల లెక్కింపు బుఽధవారం జరిగింది.

రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ.14.30 లక్షలు
రాజరాజేశ్వరి ఆలయంలో కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 20 : నెల్లూరులోని రాజరాజేశ్వరి  అమ్మవారి ఆలయంలోని హుండీల లెక్కింపు బుఽధవారం జరిగింది. గతేడాది అక్టోబరు 27 నుంచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.14,30,569 వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రత్నం జయరామ్‌, ఈవో సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి, సహాయ కమిషనర్‌ కార్యాలయ సూపరిండెంట్‌ ఎన్‌ ప్రసన్నలక్ష్మి, ధర్మకర్తలు టీ శోభారాణి, వై శివనారాయణ, బాల రాధాకృష్ణప్రసాద్‌, గజరా నరేష్‌,  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశ్రాంత ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:09:11+05:30 IST