అలీసాగర్‌లో భారీ చేప లభ్యం

ABN , First Publish Date - 2021-07-11T06:08:58+05:30 IST

ఎడపల్లి మండలం అలీసాగర్‌ చెరువులో శనివారం 30 కిలోల భారీ చేప జాలర్లకు చిక్కింది. 30 కిలోల భారీ చేప లభించడంతో మత్స్య కారులు ఆనందం వ్యక్తం చేయగా ఈ చేపను చూ సేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలీ సాగర్‌ జలాశయంలో గత కొద్దిరోజులుగా

అలీసాగర్‌లో భారీ చేప లభ్యం
30కిలోల చేపతో మత్స్యకారుడు

బోధన్‌, జూలై 10: ఎడపల్లి మండలం అలీసాగర్‌ చెరువులో శనివారం 30 కిలోల భారీ చేప జాలర్లకు చిక్కింది. 30 కిలోల భారీ చేప లభించడంతో మత్స్య కారులు ఆనందం వ్యక్తం చేయగా ఈ చేపను చూ సేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలీ సాగర్‌ జలాశయంలో గత కొద్దిరోజులుగా మత్స్యకారు లు చేపలు పడుతున్నారు. ఠాణాకలాన్‌ శివారులో శని వారం చేపలు పడుతుండగా జలాశయంలో మత్స్యకా రుల వలకు 30 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది.  పెద్ద చేప చిక్కడంతో స్థానికులు అవాక్కయ్యారు. 

Updated Date - 2021-07-11T06:08:58+05:30 IST