దున్నకం ఖర్చులూ రాకుంటే ఎలా?
ABN , First Publish Date - 2021-06-22T06:10:04+05:30 IST
దున్నకం ఖర్చులూ రాకుంటే మామిడి రైతులు ఎలా బతకాలని శాంతియుత ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు ప్రశ్నించారు.
- కలెక్టరేట్ ముందు ఈదల ఆమరణ నిరాహార దీక్ష
దున్నకం ఖర్చులూ రాకుంటే మామిడి రైతులు ఎలా బతకాలని శాంతియుత ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు ప్రశ్నించారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన మాటలు ఒట్టివేనని తేలిపోయిందన్నారు. టన్ను తోతాపురికి రూ.20వేలు ఇచ్చేవరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈయన దీక్షకు రైతులు, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. కాగా.. కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని అధికారులు ప్రకటించినప్పటికీ బాధితులు తరలివచ్చారు. డీఆర్వో మురళి, జేసీ రాజశేఖర్ వినతులను స్వీకరించారు.