ఎవడబ్బ సొమ్మని..!
ABN , First Publish Date - 2022-07-02T06:46:33+05:30 IST
ఉమ్మడి జిల్లాలో శాప్కు చెందిన బాక్సింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీలు ఉండేవి. టెన్విక్ ఆధ్వర్యంలో ఈ మూడు అకాడమీలను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగించింది.
ఉమ్మడి జిల్లాలో శాప్కు చెందిన బాక్సింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీలు ఉండేవి. టెన్విక్ ఆధ్వర్యంలో ఈ మూడు అకాడమీలను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగించింది. మూడేళ్ల క్రితం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ అకాడమీలకు చెందిన క్రీడాసామగ్రి, ఫర్నీచర్ను అశోక్ నగర్లోని డీఎ్సఏ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. రూ.1.2 కోట్ల విలువైన ఈ పరికరాలను నాలుగు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా కడప జిల్లాకు తరలించారు. జిల్లాకు క్రీడా సామగ్రి, పరికరాలు రావడమే గగనం. అలాంటిది గత ప్రభుత్వం సమకూర్చిన వాటిని పక్క జిల్లాకు తరలించడం ఏమిటని క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. శాప్కు చెందిన ఓ కీలక అధికారి, జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సామగ్రి తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డైనింగ్ టేబుల్స్, రీడింగ్ టేబుల్స్, చైర్స్, క్రీడా సామగ్రి కడపకు తరలించిన వాటిలో ఉన్నాయి. తిరిగి వీటిని జిల్లాకు తీసుకురావడం కష్టమేనని అంటున్నారు. సీఎం జగన మెప్పు కోసం ఇలా చేశారని విమర్శలు వస్తున్నాయి. శాప్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వాటిని తరలించామని, తమ సొంత నిర్ణయం కాదని డీఎ్సఏ చీఫ్ కోచ వెంకట రమణ అన్నారు. అవసరమైతే జిల్లాకు తిరిగి అందజేస్తామని చెప్పారని, ఆ ఒప్పందం ప్రకారమే పంపించామని అన్నారు. - అనంతపురం క్లాక్టవర్