ఇంట్లో హఠాత్తుగా ఏర్పడిన గొయ్యి
ABN , First Publish Date - 2021-12-02T17:21:13+05:30 IST
చెంగల్పట్టు జిల్లాలో గత రెండు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కార ణంగా జిల్లాలో ఉన్న చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిసామర్ధ్యానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో, నందివరం ఊరపాక్కం చెరువు
ప్యారీస్(చెన్నై): చెంగల్పట్టు జిల్లాలో గత రెండు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కార ణంగా జిల్లాలో ఉన్న చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిసామర్ధ్యానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో, నందివరం ఊరపాక్కం చెరువు నుంచివిడుదల చేస్తున్న మిగులు జలాలు జగదీశ్నగర్ ప్రాంతంలో ఉన్న నివాస ప్రాంతాల్లోకి చేరింది. మరోవైపు జగదీశ్నగర్ రెండవ వీధిలోని ఓ అపార్ట్మెంట్ వెనుక అడయార్ కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువలో వరద నీరు ఉధృత రూపం దాల్చడంతో కాలువ సమీపంలో నివసిస్తున్న గుణశేఖరన్ ఇంటి గదిలో హఠాత్తుగా పదడుగుల గొయ్యి ఏర్పడింది. దీని ద్వారా వరద నీరు రావడం చూసి గుణశేఖరన్ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు.