రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-04-09T07:02:36+05:30 IST
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
వనస్థలిపురం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. డీసీహెచ్ఎస్ ఝాన్సీ, కార్పొరేటర్లు మొద్దుల లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. రోగులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సకాలంలో పరీక్షలను నిర్వహించాలని, వాక్సిన్లను అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ హరిప్రియ, ఆర్ఎంవో సోమశేఖర్, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, చింతల రవికుమార్, సుమన్గౌడ్, అనిల్ చౌదరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.