ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-05-19T10:22:38+05:30 IST
పట్టణంలోని సింగరేణి పాత జీఎం కార్యాలయం ఆవ రణలోగల ఎస్అండ్పీసీ, పాత ఏటీబీసెల్ కార్యాలయ భవనాల్లో అత్యవసర చికి త్స విభాగం, ఓపీ
పనులను పరిశీలించిన సింగరేణి చీఫ్మెడికల్ అధికారి
బెల్లంపల్లిటౌన్, మే 18: పట్టణంలోని సింగరేణి పాత జీఎం కార్యాలయం ఆవ రణలోగల ఎస్అండ్పీసీ, పాత ఏటీబీసెల్ కార్యాలయ భవనాల్లో అత్యవసర చికి త్స విభాగం, ఓపీ విభాగాలను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. సోమ వారం పనులను సింగరేణి మెడికల్ అధికారి మంథని శ్రీనివాస్, జీఎం కొండ య్యతో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సివిల్ విభాగం అధి కారులు కాంట్రాక్టర్లకు సూచించారు.
భవనాల మరమ్మతుకు రూ. 8.5లక్షల రూపా యలు కేటాయించి కార్మికులకు అత్యవసర, ఔట్ పేషెంట్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మసీ కొరకు ఎస్అండ్పీసీ కార్యాలయం పక్కనే ఉన్న భవనానికి మరమ్మతులు చేయాలని సూచించారు. టేకులబస్తీ డిస్పెన్సరీని పరిశీ లించి కార్మికులకు చికిత్సలు అందించేందుకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. డివైజీఎం పర్సనల్ మురళిధర్రావు, డాక్టర్ రమేష్బాబు, ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్లు, శ్రీరాంరెడ్డి, డాక్టర్ కొండబత్తిని అశోక్కుమార్, డాక్టర్ ఉష, విజయలక్ష్మీలు, పి రమేష్బాబు, డాక్టర్ శౌరి ఉన్నారు.