భర్తతో గొడవ.. పక్కింటి యువకుడితో సహజీవనం.. చివరకు అసలు నిజం తెలిసి అతడికి మైండ్బ్లాక్..!
ABN , First Publish Date - 2022-01-25T17:38:41+05:30 IST
ఆమెకు భర్తతో తరచుగా గొడవలు జరుగుతుండేవి.. ఈ క్రమంలో ఆమెకు పక్కింటి యువకుడు దగ్గరయ్యాడు..
ఆమెకు భర్తతో తరచుగా గొడవలు జరుగుతుండేవి.. ఈ క్రమంలో ఆమెకు పక్కింటి యువకుడు దగ్గరయ్యాడు.. భర్తతో విభేదాలు ముదరడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.. వేరే ఇల్లు తీసుకుని కూతురితో కలిసి ఉండేది.. పక్కింటి యువకుడిని తన ఇంటికి ఆహ్వానించేది.. కొద్ది రోజులకు ఆ యువకుడు ఆమె ఇంటికే మకాం మార్చాడు.. ఆ యువకుడు ప్రభుత్వోద్యోగి కావడంతో డబ్బులు బాగా ఖర్చుపెట్టేవాడు.. కొన్ని రోజులకు అసలు విషయం బయటపడింది.. ఆ భార్యాభర్తలు నాటకం ఆడుతున్నారని ఆ యువకుడికి తెలిసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
రాజస్థాన్లోని జైపూర్లో నివసిస్తున్న హిమాంశు, ప్రియ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. రెండేళ్ల క్రితం వారి పక్కింట్లోకి వివేక్ అనే ప్రభుత్వోద్యోగి ఒంటరిగా దిగాడు. ప్రియ, వివేక్ మధ్య పరిచయం పెరిగింది. వివేక్కు దగ్గరయ్యేందుకు ప్రియ భర్తతో కలిసి నాటకం ఆడింది. ఇద్దరూ గొడవపడుతున్నట్టు వివేక్ ఎదుట నాటకం ఆడేవారు. కొద్ది రోజులకు ప్రియ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి అదే ఊర్లో వేరే ఇల్లు తీసుకుంది. అక్కడకు తరచుగా వివేక్ను పిలిపించుకునేది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. వివేక్ నుంచి ప్రియ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు తీసుకునేది. ఖర్చు ఎక్కువ అయిపోతుండడంతో వివేక్ ఆమెకు దూరం కావడం ప్రారంభించాడు.
దీంతో వివేక్ను ప్రియ బెదిరించింది. తనకు రూ.18 లక్షలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని హెచ్చరించింది. భయపడిన వివేక్ రూ.1.50 లక్షల ప్రియకు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా ప్రియ, ఆమె భర్త హిమాంశు బెదిరింపులకు దిగడంతో వివేక్కు ఏం చేయాలో అర్థం కాలేదు. తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో చివరకు అతను పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రియను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.