మహానందిలో హోమం
ABN , First Publish Date - 2021-07-28T05:07:19+05:30 IST
మహానంది క్షేత్రంలో మంగళవారం సంకష హర చతుర్దిని పురస్కరించుకొని ఆలయ వేదపండితులు యాగశాల మంటపంలో గణపతి మూల మంత్ర హోమం నిర్వహించారు.
మహానంది,
జూలై 27: మహానంది క్షేత్రంలో మంగళవారం సంకష హర చతుర్దిని పురస్కరించుకొని
ఆలయ వేదపండితులు యాగశాల మంటపంలో గణపతి మూల మంత్ర హోమం నిర్వహించారు.
ఈసందర్భంగా వేదపడితుల రవిశంకర్ అవధాని, నారాయణశర్మ, నాగేశ్వరశర్మ,
హనుమంతరావుశర్మలతో పాటు అర్చకుడు శరభయ్యశర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు.
ప్రదోషకాలంలో పూజను ప్రాతకాలంలో చేసే హోమం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుందనే
దృఢ సంకల్పంతో గణపతి మూలమంత్ర హోమాన్ని నిర్వహించినట్లు వేదపండితులు
తెలిపారు.