దసరాకు గృహ ప్రవేశం చేయించాలి

ABN , First Publish Date - 2020-10-20T05:52:46+05:30 IST

దసరాకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ప్రవేశం చేయించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

దసరాకు గృహ ప్రవేశం చేయించాలి

పాలమూరు, అక్టోబరు 19: దసరాకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ప్రవేశం చేయించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం షాషాబ్‌గుట్ట 19వ వార్డు కౌన్సిలర్‌ షబ్బీర్‌అహ్మద్‌, 41వ వార్డు రపీయా అంజాద్‌, 40వ వార్డు మస్రాత్‌సుల్తానా, ఆర్‌.అనంత రెడ్డిల ఇంటి ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్‌.కురుమూర్తి, బి.చంద్రకాం త్‌లు మాట్లాడుతూ కలెక్టరేట్‌, మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో వి.పద్మ, గౌసియా, పద్మ, వెంకటమ్మ, వహీద పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T05:52:46+05:30 IST