రేపు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
ABN , First Publish Date - 2021-03-09T15:23:00+05:30 IST
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మికులకు బుధవారం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్టు కార్మికశాఖ జోనల్ జాయింట్..
గుంటూరు(తూర్పు): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మికులకు బుధవారం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్టు కార్మికశాఖ జోనల్ జాయింట్ కమిషనర్ సుధాని యోగానంద్ శ్రీనివాస్ తెలిపారు. ఆయా యజమానులు తప్పనిసరిగా కార్మికులకు సెలవు ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా సెలవు ఇవ్వని పక్షంలో లేదా ఇతర సమస్యలు ఉంటే 94925 55164 అనే నెంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.