jammu kashmir: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-14T13:26:09+05:30 IST

జమ్మూకశ్మీరులోని కిష్టవర్ జిల్లాలో భారత సైనికులు, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్, పోలీసులు కలిసి సంయుక్తంగా జరిపిన దాడుల్లో ...

jammu kashmir: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్

కిష్టవర్: జమ్మూకశ్మీరులోని కిష్టవర్ జిల్లాలో భారత సైనికులు, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్, పోలీసులు కలిసి సంయుక్తంగా జరిపిన దాడుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది దొరికాడు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది ముజామిల్ హుసేన్ షాను పోలీసులు అరెస్టు చేశారు. కుల్నా అటవీప్రాంతంలోని పటిమహల్లా పలమార్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మే రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. 


ఉగ్రవాది ముజమిల్ హుసేన్ షా కొన్నిరోజుల క్రితమే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడని పోలీసులు చెప్పారు. ఇతని వద్ద నుంచి ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కశ్మీరులో ఉగ్రవాదుల సంచారం పెరిగిన నేపథ్యంలో పోలీసులు,భద్రతా బలగాలు వారికోసం గాలింపు చేపట్టాయి.

 

Updated Date - 2021-08-14T13:26:09+05:30 IST