హెచ్ఐవీపై అవగాహన పెరగాలి
ABN , First Publish Date - 2022-05-15T06:46:18+05:30 IST
హెచ్ఐవీపై అవగాహన పెరగాలి
పాయకాపురం, మే 14 : హెచ్ఐవీపై సమాజంలో విస్తృతంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రాజెక్ట్ డైరక్టర్ జి.హైమావతి అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏపీఎస్ఏసీఎస్కి సహ కరించే పార్టనర్స్ ప్రతినిధులతో శని వారంలో సమావేశాన్ని నిర్వహించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆరోగ్య శాఖలో గ్రామీణస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడానికి ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వెల్నెస్ సెంటర్స్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎన్.ఉమా సుందరి, డాక్టర్ మెలిస్సా, తదితరులు పాల్గొన్నారు.