హెచ్‌ఐవీపై అవగాహన పెరగాలి

ABN , First Publish Date - 2022-05-15T06:46:18+05:30 IST

హెచ్‌ఐవీపై అవగాహన పెరగాలి

హెచ్‌ఐవీపై అవగాహన పెరగాలి
ప్రతినిధులతో ఏపీఎస్‌ఏసీఎస్‌ పీడీ హైమావతి

పాయకాపురం, మే 14 : హెచ్‌ఐవీపై సమాజంలో విస్తృతంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సోసైటీ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ జి.హైమావతి అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఏపీఎస్‌ఏసీఎస్‌కి సహ కరించే పార్టనర్స్‌ ప్రతినిధులతో శని వారంలో సమావేశాన్ని నిర్వహించారు. ఏ రాష్ట్రంలో లేని  విధంగా ఆరోగ్య శాఖలో గ్రామీణస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడానికి ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వెల్‌నెస్‌ సెంటర్స్‌ ద్వారా బీఎస్‌సీ నర్సింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎన్‌.ఉమా సుందరి, డాక్టర్‌ మెలిస్సా, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T06:46:18+05:30 IST