హైకోర్టు చీఫ్‌ జస్టిస్‏గా అలోక్‌ ఆరాథె నియామకం

ABN , First Publish Date - 2022-07-01T17:11:36+05:30 IST

కర్ణాటక హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‏గా అలోక్‌ ఆరాథె నియమించారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి జూలై 2న పదవీవిరమణ

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‏గా అలోక్‌ ఆరాథె నియామకం

బెంగళూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‏గా అలోక్‌ ఆరాథె నియమించారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి  జూలై 2న పదవీవిరమణ పొందనున్నారు. దీంతో కొత్తగా ప్రధాన న్యాయమూర్తిగా అలోక్‌ ఆరాథెను గురువారం నియమించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయశాఖా మంత్రి రిజిజు ట్వీట్‌ చేశారు. అలోక్‌ ఆరాథెను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. జూలై 3న ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Updated Date - 2022-07-01T17:11:36+05:30 IST