ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై ఏసీబీ విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2020-09-30T09:19:59+05:30 IST
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై ఏసీబీ ..
హైకోర్టు సీనియర్ న్యాయవాది ఈఎ్సవీబీ మాధవి
బర్కత్పుర, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి) : మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బినామీ ఆస్తులు వెలుగులోకి వస్తాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది ముద్ర అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ న్యాయ సలహాదారు, ఈఎ్సవీబీ.మాధవి కోరారు. ఏసీపీ నరసింహారెడ్డికి ఉప్పల్ పీఎ్సకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సన్నిహితంగా ఉండేవారని, వారిద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తే ఎన్ని బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత సంపాదించారో తెలుస్తుందని అన్నారు. ఈ మేరకు ఏసీబీ డీజీకి మంగళవారం వినతిపత్రం అందజేసినట్లు బర్కత్పురలోని ముద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు.
గతంలో ఏసీపీ నరసింహారెడ్డితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు తనను కూడా బెదిరించారని, ముద్ర కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి నెలనెలా మామూళ్లు ఇప్పించాలని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని వారు బెదిరించారని ఆమె చెప్పారు. ఏసీపీ, సీఐ, ఎస్ఐలపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేశామన్నారు. కొంతమందితో ముద్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్పై తప్పుడు కేసులు పెట్టించారని ఆమె ఆరోపించారు.