కోదండరామయ్యను దర్శించుకున్న హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST
ఏకశిలా నగరి కోదండరామయ్యను రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎ.శ్రీనివాసులరెడ్డి కుటుంబ సమేతం గా బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు.
ఒంటిమిట్ట, మే 18: ఏకశిలా నగరి కోదండరామయ్యను రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎ.శ్రీనివాసులరెడ్డి కుటుంబ సమేతం గా బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, అర్చకు లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను తెలుసుకుని, శిల్ప సంపదను తిలకించారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ సంజీవరాయుడు, వీఆర్వో ప్రభాకర్రెడ్డి, టీటీడీ సిబ్బంది, ప్రవీణ్, అర్చకులు పాల్గొన్నారు.