రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-02-28T06:33:15+05:30 IST

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి సేవలో తరించారు.

రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ పి.నవీన్‌రావుకు ప్రసాదం అందజేస్తున్న స్థానాచార్యులు

- ఆశీర్వచనం గావించిన వేదపండితులు

వేములవాడ, ఫిబ్రవరి 27 : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి సేవలో తరించారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, వేదపండితులు శ్రీస్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం గావించారు. ఆయన వెంట స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి వినీల్‌కుమార్‌ ఉన్నారు.

 ఎమ్మెల్యే సీతక్క..

ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబసభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. అటవీ శాఖ కరీంనగర్‌ కన్జర్వేటర్‌ సైదులు శ్రీరాజరాజేశ్వరస్వామివారి సేవలో తరించారు.  


Updated Date - 2021-02-28T06:33:15+05:30 IST