లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2022-05-15T06:31:33+05:30 IST

మండలంలోని యాపదిన్నె గ్రామంలో శనివారం జరిగిన శ్రీలక్ష్మినరసింహ స్వామి జయంత్యుత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో హైకోర్టు జడ్జి
క్రీడాకారులతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి

డోన్‌ (రూరల్‌) మే 14: మండలంలోని యాపదిన్నె గ్రామంలో శనివారం జరిగిన శ్రీలక్ష్మినరసింహ స్వామి జయంత్యుత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన స్వగ్రామమైన యాపదిన్నెకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డికి ఆర్డీవో వెంకటరెడ్డి, తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, డోన్‌ కోర్టు జడ్జి షీయాజ్‌ పఠాన్‌ ఖాన్‌, స్థానిక న్యాయవాదులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు గ్రామంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా అంతర్రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడల్లో రాణించాలని మహిళా క్రీడాకారులకు హైకోర్టు న్యాయమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి సొంత గ్రామానికి రావడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Updated Date - 2022-05-15T06:31:33+05:30 IST