ఆపదలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాం

ABN , First Publish Date - 2022-08-17T06:56:32+05:30 IST

తన తండ్రి మరణం తరువాత తమ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పిన ప్రతిఒక్కరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

ఆపదలో అండగా నిలిచిన  ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాం

 టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి 

అనపర్తి, ఆగస్టు 16 : తన తండ్రి మరణం తరువాత తమ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పిన ప్రతిఒక్కరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండల ంలోని రామవరంలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఈనెల 1వ తేదీన తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అభిమానులు తరలి వచ్చారని అదేవిధంగా 2వ తేదీన జరిగిన అంత్యక్రియలకు వేలాదిగా అభి మానులు తరలివచ్చారని అన్నారు. ఆయన మరణం తరువాత ఎంతోమంది అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైద్యులు తరలివచ్చి తనకు తన కుటుంబానికి ధైర్యం చెప్పారని అన్నారు. తన తండ్రి 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను చూశారని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటం చేశారని, అందుకే ఆయనకు అభిమానులు ఘనంగా నివాళులర్పించారని అన్నారు. 



Updated Date - 2022-08-17T06:56:32+05:30 IST