ఢిల్లీలో హలో తెలంగాణ అంటూ పలకరిస్తారు
ABN , First Publish Date - 2022-08-14T05:57:50+05:30 IST
తాను ఢిల్లీ వెళి తే ఇప్పటికీ హలో తెలంగాణ అని పలుకరిస్తారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫ కరీంనగర్ జిల్లాకు చేరిన పాదయాత్ర
కరీంనగర్ రూరల్, ఆగస్టు 13: తాను ఢిల్లీ వెళి తే ఇప్పటికీ హలో తెలంగాణ అని పలుకరిస్తారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రారంభించిన పాద యాత్ర శనివారం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. బావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తే పార్లమెంటులో ఆంధ్రా పాలకుల పెప్పర్ దాడితో తాను అంటే ఏమిటో దేశమంతా తెలిసిందన్నారు. ఇప్పటికీ ఢిల్లీ వెళితే అక్కడి వారి హలో తెలంగాణ అని పలుకరిస్తారని గుర్తు చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నామన్నారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాల ఎక్స్రోడ్, బావుపేట ఎక్స్రోడ్, ఎలగందల్ ఎక్స్రోడ్, శ్రీరాములపల్లె, బద్దిపల్లె, కమాన్పూర్, ఒడ్డెపల్లె, రాములపల్లి వరకు పాద యాత్ర కొనసాగి రాత్రి బస చేశారు. కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనాల మురళి మనోహర్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మేనేని రోహిత్రావు, పొన్నం సత్యం, మడుప మోహన్చారి, శ్రావణ్నాయక్, బొమ్మ ఈశ్వర్గౌడ్ తది తరులు పాల్గొన్నారు.
- ప్రజలకు న్యాయం చేయాలి
గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో ని ప్రజలకు పరిహారం అందించి న్యాయం చేయా లని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చే శారు. పొన్నం పాదయాత్ర గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి శనివారం చేరుకుంది. ఈసం దర్భంగా గ్రామస్థులతో పొన్నం మాట్లాడి సమ స్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట చొప్ప దం డి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, మండ లాధ్యక్షుడు మనోహర్ తదితరులు ఉన్నారు.