వర్షబీభత్సానికి రోడ్లన్నీ గుంతలమయం

ABN , First Publish Date - 2021-11-21T15:40:51+05:30 IST

నగరంలో ఇటీవలి కుండపోత వర్షాలకు ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలోని రాయపేట, మైలాపూరు, పాడి, అంబత్తూరు, తాంబరం, పెరంగళూత్తూరు, మందవెల్లి, సైదాపేట, గిండి తదితర ప్రాంతాల్లోని

వర్షబీభత్సానికి రోడ్లన్నీ గుంతలమయం

               - అల్లాడిపోతున్న వాహన చోదకులు


చెన్నై: నగరంలో ఇటీవలి కుండపోత వర్షాలకు ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలోని రాయపేట, మైలాపూరు, పాడి, అంబత్తూరు, తాంబరం, పెరంగళూత్తూరు, మందవెల్లి, సైదాపేట, గిండి తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులలో గుంతలు ఏర్పడ్డాయి. వాటిని పూడ్చాలన్నా వీలు కావడం లేదని అధికారులు వాపోతున్నారు. దీంతో వారం రోజులుగా ఈ రహదారుల్లో వెళ్లే వాహనాలు దెబ్బతింటున్నాయి. మోటారు బైకులు, స్కూటర్ల టైర్లకు పంక్చర్లు అవుతున్నాయి. ప్రస్తుతం రహదారుల్లో వాన నీటిని తొలగించే పనులను మాత్రమే కార్పొరేషన్‌ అధికారులు చేపడుతున్నారు.



Updated Date - 2021-11-21T15:40:51+05:30 IST