రుద్రంగిలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-10-18T06:08:48+05:30 IST
రుద్రంగి మండల కేంద్రం లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో పంట నష్టం జరిగింది.
- నేలకొరిగిన వరి పంట
రుద్రంగి అక్టోబరు 17: రుద్రంగి మండల కేంద్రం లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో పంట నష్టం జరిగింది. పంటలు చేతికి వచ్చే సమయంలో భారీ వర్షానికి వరి పంట నేలకొరిగింది. మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ అనే రైతుకు చెందిన మూడెకరాల వరి పంట పూర్తిగా నేలకొరిగింది. ఇప్పటికే మండలంలో వరి కోతలు ప్రారంభం అ య్యాయి. కాని కోనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారం భం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
- పిడుగు పాటుకు రెండు గేదెల మృతి
చందుర్తి: చందుర్తి మండల కేంద్రంతో పాటు నర్సింగాపూర్ గ్రామాల్లో ఉరుముల, మెరుపుల వర్షంతో పాటు పిడుగు పాటుకు రెండు గేదెలు మృతి చెందాయి.
మండల కేంద్రానికి చెందిన ప్రభాకర్రావు, నర్సింగాపూర్కు చెందిన సంపునూరి దేవయ్య అనే రైతులు రోజు మాదిరిగానే తమ పశువుల పాకలో గేదెలను కట్టేశారు. శనివారం రాత్రి పశువుల పాకల్లో పిడుగులు పడడంతో రెండు గేదెలు మృతి చెందాయి. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకో వాలని గ్రామస్థులు కోరారు.