జైనూర్ మండలంలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-06-18T04:43:29+05:30 IST
మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది.
వాగులో చిక్కుకున్న 30మంది రైతులు
జైనూర్, జూన్ 17: మండలంలో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. చింతకర్ర, తాడిగూడ, కిషన్నాయక్తాండ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ పనులుచేసి తిరుగు ప్రయాణంలో చింతకర్రవాగును దాటుతుండంగా నీటి ప్రవాహం పెరిగింది. సూమరు 30మంది వాగులో చిక్కుకున్నారు. రైతుల అరుపులు, కేకలువిన్న సమీప గ్రామయువకులు తాడు సహాయంతో వారిని ఒడ్డుకులాగారు. దీంతో ప్రాణపాయం తప్పిందని రైతులు ఊపిరిపీల్చుకున్నారు. చింతకర్రవాగుపై వంతెన మంజూరైన ప్పటికీ నిర్మించడంలో తీవ్రజాప్యం చేస్తున్నారని ఆయాగ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.